Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (23:13 IST)
కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేబుల్ టాప్ వంటి ఆ విమానశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 18 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
 
విమానంలో చిక్కుకొని పోయిన వారిని వెలికి తీసేందుకు దాదాపు 3 గంటలకు పైగా సమయం పట్టింది. మరో వైపు రెస్క్యూ ఆఫరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యులు తెలిపారు.
 
రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత వీరిని క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులతో పాటు దాదాపు 600 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. వీరిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారనే విషయంపై జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments