Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే మఠంలో 150 మంది భిక్షువులకు కరోనా

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:28 IST)
ధర్మశాలలోని ప్రముఖ గ్యుటో మఠంలో 150 మంది బౌద్ధ భిక్షువులకు కరోనా సోకినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ మఠం ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఈ మఠంలో పెద్ద ఎత్తున కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

‘‘ఇప్పటి వరకు కాంగ్రా జిల్లాలో 330 మంది బౌద్ధ భిక్షువులకు కరోనా సోకింది. వారిలో 154 మంది గ్యుటో మఠానికి చెందిన వారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో  వైద్యకళాశాలకు తరలించి చికిత్సనందిస్తున్నాం. మిగిలిన వారిని మఠంలోనే ఐసోలేషన్‌లో ఉంచాం.’’ అని కాంగ్రా ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ గురుదర్శన్‌ గుప్తా తెలిపారు.

ఈ బౌద్ధ భిక్షువులు ఇటీవల ఎక్కడికీ వెళ్లలేదని ఆయన తెలిపారు. కానీ నూతన సంవత్సరం సమయంలో కొందరు దిల్లీ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా మార్చి 5 వరకు మఠంలోకి సందర్శకులను అనుమతించట్లేదని అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో 58,777 కరోనా కేసులు నమోదవ్వగా, 996 మరణాలు సంభవించాయి. మంగళవారానికి క్రియాశీల కేసుల సంఖ్య 434గా ఉంది.

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments