Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:22 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న నేప‌ధ్యంలో ఏపీలో కూడా ఇటీవలి కాలంలో బాగా తగ్గిన కేసులు... మళ్లీ పెరుగుతున్నాయి.

మంగ‌ళ‌వారం కొత్తగా 70 కేసులు నమోదు కాగా... బుధ‌వారం వాటి సంఖ్య మరింత పెరిగింది. గడ‌చిన 24 గంటల్లో 94 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు 66 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,89,503కి చేరుకుంది. మొత్తం 8,81,732 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,168 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 603 యాక్టివ్ కేసులు ఉన్నాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే వినూత్నం ‘జగనన్న సంక్షేమ క్యాలెండర్’: మంత్రి పేర్ని నాని