Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో భర్త మృతి.. చితికి నిప్పంటించిన భార్య

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:29 IST)
కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్ డౌన్ కారణంగా.. బంధువులు ఎవ్వరూ రాలేకపోయారు. చివరికి కట్టుకున్న భార్యే చితికి నిప్పు అంటించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో కరోనా సోకిన భర్త మృతిచెందడంతో భార్య అతని చితికి నిప్పు పెట్టింది. కరోనా బాధితుడు అమిత్ అగర్వాల్ భోపాల్ లోని హమీడియాలోని ఆసుపత్రిలో మృతి చెందాడు. 
 
టిఫిన్ సెంటర్‌ నడుపుతున్న ఇతడి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వర్ష సహకారి బ్యాంకులో పనిచేస్తోంది. తన భర్త మరణం గురించి సమాచారం అందుకున్న ఆమె భర్తకు తానే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 
 
కరోనా అనుమానంతో అమిత్ సోదరుడు కూడా హమిడియా ఆసుపత్రిలో చేరాడు. మృతుని పిల్లలు ఇద్దరూ రాజధాని భోపాల్‌లో ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వర్ష అనుమతి కోరింది. అయితే అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీనితో వర్ష స్వయంగా భర్తకు సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించింది. భర్త చితికి ఆమే నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments