Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఏపీలో 24 గంటల్లోనే 62మందికి కోవిడ్

Webdunia
శనివారం, 23 మే 2020 (10:29 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారత్‌లో ఇప్పటి వరకూ 1,25,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,720 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 51,784 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
 
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 62 మందికి కరోనా సోకింది. ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 8,415 శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో తాజా కేసులు బయటపడ్డాయి. అటు.. రోజు వ్యవధిలో 51 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 
 
ఇదిలా ఉండగా, వ్యాధి తీవ్రత ఎక్కువై కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణించాడు. మొత్తం మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 728 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments