Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఏపీలో 24 గంటల్లోనే 62మందికి కోవిడ్

Webdunia
శనివారం, 23 మే 2020 (10:29 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారత్‌లో ఇప్పటి వరకూ 1,25,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,720 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 51,784 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
 
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 62 మందికి కరోనా సోకింది. ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 8,415 శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో తాజా కేసులు బయటపడ్డాయి. అటు.. రోజు వ్యవధిలో 51 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 
 
ఇదిలా ఉండగా, వ్యాధి తీవ్రత ఎక్కువై కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణించాడు. మొత్తం మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 728 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments