Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు భారీగా తగ్గాయి! కేర‌ళ‌లోనే భూతం!!

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (11:49 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా అదుపులో ఉంటున్న కొత్త కేసులు.. తాజాగా 10 వేలకు పడిపోయాయి. ఫిబ్రవరి నెల మధ్యనాటికి  క్షీణించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 
సోమవారం 10,09,045 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,423 మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు ఎనిమిదిన్నర నెలల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. నిన్న 15,021 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 3.36 కోట్ల మందికి పైగా మహమ్మారి నుంచి బయపటపడ్డారు.

 
కొత్త కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,53,776గా ఉంది. గత 250 రోజుల్లో ఇదే అత్యల్పం.  క్రియాశీల కేసుల రేటు 0.45 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.21 శాతానికి పెరిగింది.

 
 కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో.. మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 443 మరణాలు నమోదుకాగా.. అందులో 368 కేరళలో రికార్డయినవే. ఇప్పటివరకు కరోనా కారణంగా 4,58,880 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క నిన్న 52 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 106 కోట్ల మార్కును దాటింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments