Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 24 గంటల్లో 29,163 కొత్త కేసులు..449 మరణాలు

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:42 IST)
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శీతకాలం, పండుగల వాతావరణం కారణంగా వైరస్ సంక్రమణ వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మాస్కులు ధరించాలని, కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. వీటన్నింటి మధ్య తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ఊరట కలిగిస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో 29,163 కొత్త కేసులు వెలుగు చూడటమే అందుకు కారణం. జులై 15 తరవాత 30వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88,74,290 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

ఇక, సోమవారం కొవిడ్‌తో 449 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 1,30,519కి చేరింది. క్రియాశీల కేసులు ఐదు లక్షల దిగువన ఉన్నాయి.  రికవరీ రేటు రోజురోజుకూ పెరగడం సానుకూలంగా కనిపిస్తోంది.
 
క్రియాశీల కేసుల సంఖ్య 4,53,401(5.11శాతం) ఉండగా.. ఇప్పటి వరకు 82,90,370(93.42శాతం)మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.

కాగా, నవంబర్ 16నాటికి దేశవ్యాప్తంగా 12,65,42,907 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..నిన్న ఒక్కరోజే 8,44,382 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments