Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : బీజేపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు... ఓట్లు శాతం మాత్రం పదిలం...

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (10:11 IST)
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. కానీ, ఆ పార్టీ ఓటింగ్ శాతం మాత్రం పదిలంగా ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 300కు పైగా స్థానాల్లో గెలుస్తుందని, ఎన్డీయే కూటమి ఏకంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
 
ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390 - 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ మార్కు కంటే 21 సీట్లు అధికంగా ఎన్డీయే 293 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీకి 240 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 
 
గత ఎన్నికల్లో కమలం పార్టీకి 37.37 శాతం ఓట్లు రాగా ఈసారి 37.34 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగానూ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.49 శాతం ఓట్లు రాగా ఈసారి 22.34 శాతం ఓట్లు సాధించింది. ఇక ఇండియా కూటమికి సుమారు 42 శాతం ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్డీయే చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments