Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు : బీజేపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు... ఓట్లు శాతం మాత్రం పదిలం...

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (10:11 IST)
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. కానీ, ఆ పార్టీ ఓటింగ్ శాతం మాత్రం పదిలంగా ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 300కు పైగా స్థానాల్లో గెలుస్తుందని, ఎన్డీయే కూటమి ఏకంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
 
ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390 - 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ మార్కు కంటే 21 సీట్లు అధికంగా ఎన్డీయే 293 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీకి 240 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 
 
గత ఎన్నికల్లో కమలం పార్టీకి 37.37 శాతం ఓట్లు రాగా ఈసారి 37.34 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగానూ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.49 శాతం ఓట్లు రాగా ఈసారి 22.34 శాతం ఓట్లు సాధించింది. ఇక ఇండియా కూటమికి సుమారు 42 శాతం ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్డీయే చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments