Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా ఆశీర్వాదం పొందడంలో ఫెయిల్ అయ్యాం : కాంగ్రెస్

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (07:31 IST)
తాము ప్రజా ఆశీర్వాదం పొందడంలో పూర్తిగా విఫలమైనట్టు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 403 స్థానాలు ఉన్న యూపీలో కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితమైంది. 
 
అంతేకాకుండా అంతర్గత కుమ్ములాటలు కారణంగా పంజాబ్‌లో అధికారానికి దూరమైంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గెలుస్తామన్న ఆశలు అడియాశలయ్యాయి. ఈశాన్య రా
ష్ట్రమైన మణిపూర్‌లో కాషాయం జెండా ఎగిరింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగింటిలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అఖండ విజయాలను సొంతం చేసుకున్నాయి. 
 
ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పందిస్తూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. 
 
తమ అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజా ఆశీర్వాదం పొందడంలో తాము పూర్తిగా విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. ఈ ఫలితాలపై చర్చించేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సూర్జేవాలా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments