Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారం కోసం కాంగ్రెస్ ఎంత నిజానికైనా దిగజారుతుంది : ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (17:04 IST)
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆదివారం అసోంలోని బోకాఖత్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 
 
అసోం విషయంలో ఆ పార్టీ అన్నీ బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. అటు కేంద్రంలో, ఇటు అసోంలో ఆ పార్టీ అధికారంలో ఉండగా.. భద్రత, స్థిరత్వం విషయంలో విఫలమైందన్నారు. 
 
అధికారం కోసం ఆ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని మోడీ విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చేందుకూ వెనకాడదన్నారు. అందుకు ఆ పార్టీ మేనిఫెస్టోనే ఉదాహరణ అని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ హయాంలో అసోం రెట్టింపు నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రంలో అవినీతి రెట్టింపైందని, చొరబాట్లు రెట్టింపయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘అబద్ధాలు.. అయోమయం.. అవినీతి.. హింసాత్మక’ పార్టీ అని మండిపడ్డారు. మహిళా సాధికారత, ఉద్యోగాల కల్పన విషయంలో ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. 
 
రెండు ఇంజన్ల ఎన్డీయే ప్రభుత్వం అసోం అభివృద్ధికి శతవిధాలా కృషి చేసిందని మోదీ చెప్పారు. దేశంతో అసోంను కలిపిందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులను చేసిందన్నారు. మరో ఐదేళ్లలో అభివృద్ధిలో అసోం దూసుకుపోతుందని హామీ ఇచ్చారు.
 
ప్రస్తుతం ఆ పార్టీ ఖజానా ఖాళీ అయిందని, దానిని నింపుకోవడం కోసం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాట పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసోంలో బాంబు పేలుళ్లు, తుపాకుల సంస్కృతి, హింస ఎప్పుడు అంతమవుతుందో అని ప్రజలు అనుకునేవారని మోడీ గుర్తు చేశారు. 
 
అదంతా బీజేపీ హయాంలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం అసోంలో శాంతి, స్థిరత్వం వచ్చిందన్నారు. స్మగ్లర్లకు కాంగ్రెస్ కొమ్ముకాసిందని మోదీ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైనోల స్మగ్లింగ్‌ను అడ్డుకుందని చెప్పారు. స్మగ్లర్లను జైల్లో పెట్టామన్నారు. ఆక్రమణదారుల చెర నుంచి కజిరంగ పార్కును రక్షించామని ప్రధాని మోడీ చెప్పకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments