Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్ - ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:03 IST)
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు జారీ చేసిన సమయంలో రాహుల్ విదేశాల్లో ఉన్నారు. ఇపుడు స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధించనున్నారు. నిజానికి ఈ నెల 2వ తేదీన రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సివుంది. కానీ, విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. 
 
కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత పవన్ బన్సల్‌ను విచారించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments