ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్ - ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:03 IST)
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు జారీ చేసిన సమయంలో రాహుల్ విదేశాల్లో ఉన్నారు. ఇపుడు స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధించనున్నారు. నిజానికి ఈ నెల 2వ తేదీన రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సివుంది. కానీ, విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. 
 
కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత పవన్ బన్సల్‌ను విచారించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments