Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది.. అయినా... చిదంబరం కామెంట్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (14:31 IST)
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కేంద్ర మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం మాట్లాడుతూ, తమ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. అయినా నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. అన్ని రాజకీయ పక్షాలూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నట్లుగానే, కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోందన్నారు.
 
అదేసమయంలో తమలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిందేనని నిర్మొహమాటంగా వెల్లడించారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
గత రెండున్నరేళ్ల కంటే ముందు పార్టీ ఎన్నో విజయాలను సాధించిందని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు తాత్కాలికమేనని అన్నారు. కేరళ, తమిళనాడులో తమ ప్రభుత్వాలను స్థాపిస్తామని, అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే, తమ పార్టీ అధ్యక్షుడుని ఎన్నుకునేది జర్నలిస్టులు కాదని, కేవలం పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, దేశంలోని 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments