కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది.. అయినా... చిదంబరం కామెంట్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (14:31 IST)
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కేంద్ర మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం మాట్లాడుతూ, తమ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. అయినా నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. అన్ని రాజకీయ పక్షాలూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నట్లుగానే, కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోందన్నారు.
 
అదేసమయంలో తమలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిందేనని నిర్మొహమాటంగా వెల్లడించారు. అయితే అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. 
 
గత రెండున్నరేళ్ల కంటే ముందు పార్టీ ఎన్నో విజయాలను సాధించిందని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు తాత్కాలికమేనని అన్నారు. కేరళ, తమిళనాడులో తమ ప్రభుత్వాలను స్థాపిస్తామని, అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే, తమ పార్టీ అధ్యక్షుడుని ఎన్నుకునేది జర్నలిస్టులు కాదని, కేవలం పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, దేశంలోని 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments