Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజు రోజుకూ పైపైకి... దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

రోజు రోజుకూ పైపైకి... దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
, శుక్రవారం, 12 మార్చి 2021 (10:45 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23,285 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసింది. వాటి ప్రకారం... 15,157 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,08,846కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 117 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,53,303 మంది కోలుకున్నారు. 1,97,237 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,61,64,920 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
ఇదిలావుంటే, గురువారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 22,49,98,638 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,40,345 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 181 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గురువారం కరోనాతో ఒకరు మరణించారు. 
 
కరోనా బారి నుంచి గురువారం 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 44 కరోనా కేసులు నమోదయ్యాయి.  
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ డ్రైవర్ తాగినా మీకూ జైలు తప్పదు