Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్లా కంటే రమణీయమైన ప్రదేశం గూడలూకు : రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (14:14 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను విజయవంతంగా సాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఆయన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. భారతదేశం ఒక రాష్ట్రం, ఒక భాషను మాట్లాడే ప్రజలు కాదన్నారు. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు అనేక సంస్కృతుల సమూహారమే భారత్ అని గుర్తుచేశారు. అలాంటి దేశంలో ఎలాంటి కల్మషాలు, కుళ్లుకుతంత్రాలు లేకుండా జీవించే ప్రజల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో అంశాంతిని రాజేస్తుందన్నారు. 
 
ఉత్తరభారతదేశంలోని సిమ్లా కంటే ఈ గూడలూరు ఎంతో అందమైన, రమణీయమైన ప్రాంతమన్నారు. ఎందుకంటే.. ఈ ప్రాంతం చుట్టూత ఎత్తైన కొండలు, ఎంతో అందమైన పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా ఉందన్నారు. పైగా, మూడు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. 
 
ఈ ప్రాతంలో తమిళం, కన్నడం, మలయాళ భాషలు మాట్లాడే ప్రజలు, మూడు విభిన్న సంస్కృతుల ప్రజలు ఐకమత్యంతో ఉంటున్నారన్నారు. ఇలాంటి వాతావరణమే దేశ వ్యాప్తంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశమని రాహుల్ గాంధీ వివరించారు. ఇదిలావుండగా ఆయన యాత్ర శుక్రవారం కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఈ యాత్రంలో 21 రోజుల పాటు కొనసాగనుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments