వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్..

Webdunia
ఆదివారం, 16 మే 2021 (09:45 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో క‌రోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టసాగింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఆదివారం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఆంక్ష‌లు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 
 
సంపూర్ణ లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ‌లు, మెట్రో స‌ర్వీసులు, అంత‌ర్రాష్ట్ర రైళ్లు, బ‌స్సుల‌ను నిలిపివేశారు. అన్నిర‌కాల స‌మావేశాల‌పై నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని తేయాకు తోట‌ల్లో 50 శాతం కార్మికులు ప‌నిచేసేలా వెసులుబాటు క‌ల్పించింది. 
 
జ‌న‌ప‌నార మిల్లుల్లో 30 శాతం కార్మికులు ప‌నిచేసేందుకు అనుమ‌తించింది. అత్య‌వ‌సర సేవ‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు నిచ్చారు. ప్ర‌జలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుక్కునేందుకు ఉద‌యం 7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.
 
కాగా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో శనివారం 20,846 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 9,50,017 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 12,993 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments