Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్.. సీఎం ఎడప్పాడి

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:55 IST)
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు. కరోనా భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని అన్నారు. చెన్నైతో పాటు కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
 
 
చెన్నై, కోయింబత్తూరు, మదురైలను ఈ నెల 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనాను తరిమికొట్టే దిశ ఈ చర్యలు తప్పట్లేదని.. ప్రజలు సహకరించాలని పిలుపు నిచ్చారు. ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. 
 
అయితే, అన్ని అవసరమైన సేవలు కొనసాగుతూనే ఉంటాయని సీఎ స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్లినికల్ ల్యాబ్‌లు, అంబులెన్సులు, అనుబంధ సేవలు, ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు, ఆవిన్, స్థానిక పరిపాలన, తాగునీటి సరఫరా కొనసాగుతూనే ఉంటుందన్నారు. కోయంబేడులో ఉన్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లు తగిన నిబంధనలలో పనిచేస్తాయని.. అదేవిధంగా, కూరగాయలు, పండ్లను మొబైల్ బండ్లలో మాత్రమే అమ్మడానికి అనుమతి ఉంటుంది. ఈ రోజుల్లో ఇతర షాపులు పనిచేయడానికి ఎటువంటి అనుమతి లేదని సీఎం తెలిపారు.
 
కాగా.. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments