Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. పలువురు జవాన్లు మృతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (15:43 IST)
మణిపూర్‌‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. 46 అసోం రైఫిల్స్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్‌పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో కమాండింగ్ ఆఫీసర్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు జవాన్లు మరణించారు. 
 
చూరచాంద్‌పూర్ జిల్లా బెహియాంగ్ పరిధిలోని సెకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు క్విక్ రియాక్షన్ టీమ్ వాహనాల్లో వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు.
 
జవాన్లు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నలుగురు జవాన్లు స్పాట్‌లోనే మరణించినట్లు తెలిసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
 
సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ జవాన్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. సెకెన్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 
 
జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఐతే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు ప్రకటన విడుదల చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments