Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలి తీవ్రత: కాన్పూర్‌లో ఒక్కరోజే 25మంది మృతి

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (11:00 IST)
ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత కారణంగా ఒక్క కాన్పూర్ ప్రాంతంలోనే ఒక్కరోజే 25 మంది చనిపోయారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా మంచు కురుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన చలి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 
 
ఈ పరిస్థితిలో రోడ్డుపక్కన నివాసముంటున్న నిరాశ్రయులకు శాశ్వత నివాసం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, చాలా ప్రాంతాల్లో ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. 
 
నోయిడా, ఘజియాబాద్, అయోధ్య, కాన్పూర్, లక్నో, బరేలీ, మొరాదాబాద్‌లలో పగటిపూట కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలో కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
 
ఉత్తరప్రదేశ్‌లో చలి రోజురోజుకు పెరుగుతుండటంతో కాన్పూర్‌లో గురువారం (5వ తేదీ) గుండెపోటు, పక్షవాతం కారణంగా 25 మంది మరణించారు. వీరిలో 17 మంది వైద్యం అందక ముందే మృతి చెందినట్లు సమాచారం. విపరీతమైన చలి వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటుతో చనిపోతారని, రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments