పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

ఠాగూర్
సోమవారం, 28 జులై 2025 (12:12 IST)
గత ఏప్రిల్ నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడింది మన దేశానికి చెందిన ఉగ్రవాదులేనన్నారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. 
 
పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎన్ఐఏ) ఇప్పటివరకూ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గుర్తుచేశారు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం కూడా బయటపెట్టడంలేదని, ఇన్ని రోజులు గడిచినా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదేమని నిలదీశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను అసలు గుర్తించారా..? ఇన్ని రోజులుగా ఎన్ఐఏ అధికారులు ఏంచేస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని ఎలా నిర్ధారించారు? దానికి ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలేంటి? దర్యాప్తు వివరాలను కేంద్రం ఎందుకు బయటపెట్టడంలేదు? అంటూ చిదంబరం పలు ప్రశ్నలు సంధించారు. 
 
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారి పరిస్థితి ఏమైందని, విచారణలో వారు వెల్లడించిన వివరాలను కేంద్రం బయటకు వెల్లడించకపోవడానికి కారణమేంటని చిదంబరం ప్రశ్నించారు.
 
ఆపరేషన్ సింధూర్ పైనా చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల సందర్భంగా పొరపాట్లు దొర్లాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బహిరంగంగానే అంగీకరించారని చిదంబరం పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందని ఆరోపించారు. యుద్ధంలో రెండు వైపులా నష్టం వాటిల్లుతుందనే విషయం అందరికీ తెలుసని చిదంబరం పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments