Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:24 IST)
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
హోం వర్క్ సరిగా చేయకపోవడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మహిళా టీచర్‌పై వారు కోపం పెంచుకున్నారు. ఆమె మరుగుదొడ్డికి వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అది పేలిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన ఈ నెల 21వ తేదీన చోటుచేసుకుంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని జువైనల్ హోంకు తరలించారు. అరెస్టు చేసిన వారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments