Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:24 IST)
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
హోం వర్క్ సరిగా చేయకపోవడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మహిళా టీచర్‌పై వారు కోపం పెంచుకున్నారు. ఆమె మరుగుదొడ్డికి వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అది పేలిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన ఈ నెల 21వ తేదీన చోటుచేసుకుంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని జువైనల్ హోంకు తరలించారు. అరెస్టు చేసిన వారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments