Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్...

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (17:03 IST)
అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. 
 
రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్యలు 90 కాగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 57 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 14 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ దఫా తొలి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినప్పటికీ తర్వాత వెనకబడింది. .
 
మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 165 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, ఇతరులు ఒక స్థానంలో నిలిచారు. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో 199 సీట్లకు గాను బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఐఎన్డీ 7, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments