Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోర ప్రమాదం.. కారు లోయలోపడి..8మంది మృతి

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (11:41 IST)
కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగా వస్తూ అదుపుతప్పి లోయలో పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. 
 
ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. లోయలో నుంచి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. 
 
మృతదేహాలకు శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి వారి బంధువులకు అప్పగిస్తామని కలెక్టరు శిఖా రాజ్ పుత్ తివారీ చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25వేలను అందించామని కలెక్టరు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments