Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్మా జిల్లాలో విద్యార్థిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (09:03 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఒక విద్యార్థినితో పాటు మొత్తం ఐదుగురిని అపహరించారు. సుక్మా జిల్లాలోని కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. 
 
ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. కాగా, వారిని ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారని వెల్లడించారు.
 
కొన్నిసార్లు సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని చెప్పారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్‌ రీజియన్‌లోని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయన్నారు. గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మందిని ఎత్తుకెళ్లారని, రెండు మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని శర్మ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments