Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచింది కొండంత.. తగ్గించింది గోరంత : ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘెల్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (08:37 IST)
దీపావళి పండుగకు ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5, రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ స్పందించారు. ఈ తగ్గింపు సరిపోదని, యూపీఏ-2 హయాంలో ఉన్న స్థాయికి పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు దిగివచ్చి ఎక్సైజ్‌ డ్యూటీని కాస్తంత తగ్గించిందని ఎద్దేవా చేశారు. 'ముందేమో పెట్రోలు ధరలను రూ.30 దాకా ధర పెంచారు. ఇప్పుడు కేవలం రూ.5 తగ్గించి.. అందరి ప్రశంసలనూ కోరుకుంటున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
ఎక్సైజ్‌ డ్యూటీ యూపీఏ హయాంలో రూ.9.27 ఉండేదని.. దాన్ని రూ.30కి పెంచేశారని.. అప్పటిలాగా ఇప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీని రూ.9కి తగ్గించాలని, అప్పుడు ప్రజలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆయన సూచించారు. అదేసమయంలో తాము రాష్ట్రపరిధిలో ఉన్న పన్నులను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments