పెంచింది కొండంత.. తగ్గించింది గోరంత : ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘెల్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (08:37 IST)
దీపావళి పండుగకు ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5, రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ స్పందించారు. ఈ తగ్గింపు సరిపోదని, యూపీఏ-2 హయాంలో ఉన్న స్థాయికి పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు దిగివచ్చి ఎక్సైజ్‌ డ్యూటీని కాస్తంత తగ్గించిందని ఎద్దేవా చేశారు. 'ముందేమో పెట్రోలు ధరలను రూ.30 దాకా ధర పెంచారు. ఇప్పుడు కేవలం రూ.5 తగ్గించి.. అందరి ప్రశంసలనూ కోరుకుంటున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
ఎక్సైజ్‌ డ్యూటీ యూపీఏ హయాంలో రూ.9.27 ఉండేదని.. దాన్ని రూ.30కి పెంచేశారని.. అప్పటిలాగా ఇప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీని రూ.9కి తగ్గించాలని, అప్పుడు ప్రజలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆయన సూచించారు. అదేసమయంలో తాము రాష్ట్రపరిధిలో ఉన్న పన్నులను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments