ఛార్జింగ్‌ పెట్టి గేమ్ ఆడిన బాలుడు.. స్మార్ట్‌ఫోన్ పేలింది.. పేగు బయటికొచ్చింది..

చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెల

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:42 IST)
చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెలుసుకుంటే.. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ అస్సలు పెట్టరు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మొబైల్ గేమ్ ఆడుతుండగా, స్మార్ట్ ఫోన్ పేలి బాలుడు మృతి చెందాడు. 
 
ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి సోన్‌వాన్ (12) ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతుండగా ఆతడి ఫోన్ చేతిలోనే పేలింది. పేలుడు ధాటికి రవి పేగులు బయటపడ్డాయి.
 
కుటుంబ సభ్యులు వెంటనే వాటిని లోపల పెట్టి కడుపు చుట్టూ గట్టిగా కాటన్ కట్టి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడికి ఆపరేషన్ జరిగినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడిన కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments