చెరువులో ఛత్తీస్‌గఢ్ నటి మృతదేహం...

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:16 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వర్ధమాన నటి ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె శవం చెరువు నీటిలో తేలింది. తన కుమార్తె మృతదేహాన్ని తల్లి గుర్తించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన అంచల్ యాదవ్ నటిగా, మోడల్‌గా రాణిస్తోంది. ఈమె గత సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడిందని, ఆ తర్వాత మళ్లీ ఆమెను చూడనేలేదని తల్లి వివరించారు. ఆంచల్ వంటిపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. 
 
గతంలో ఆంచల్‌కు ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని, అప్పట్లో ఓ వీడియోతో అతడిని బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు ఆంచల్ బీమా ఏజెంట్‌గా కూడా పని చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె ఓ చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో, వారు నటి మృతదేహాన్ని వెలికి తీశారు. మొదట ఆమె ఎవరో గుర్తించలేకపోయారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో ఆంచల్ తల్లి వెంటనే స్పందించి అది తన కుమార్తె శవమేనని చెప్పింది. దుండగులు ఆంచల్‌ను దారుణంగా హతమార్చి ఆపై శవానికి పెద్ద రాయి కట్టి నీటిలో వదిలేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments