Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి పది లక్షలు స్వాహా..

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:26 IST)
Rummy
ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి లక్షల్లో పోగొట్టుకుని, చివరికి తీవ్ర మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై మనాలి న్యూ టౌన్‌లో నివసించే బి.భవాని బీఎస్సీ పట్టభద్రురాలు. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమెకు భర్త భక్కియరాజ్ (32), ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు.
 
ఆ పిల్లల్లో ఒకరికి మూడేళ్ల వయసు కాగా, మరొకరికి ఏడాది వయసు. భవాని ఓ ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తుండగా, ఆమె భర్త తొరైపాక్కంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. 
 
అయితే భవాని కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారింది. భవాని పేకాట పిచ్చి గమనించిన భర్త, తల్లిదండ్రులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. 
 
వారి మాటలను పెడచెవినపెట్టిన ఆ మహిళ ఎప్పటికైనా భారీగా డబ్బు రాకపోతుందా అన్న ఆశతో ఆన్ లైన్ జూదంలో నిత్యం మునిగితేలేది. 
 
ఉన్న డబ్బంతా అయిపోగా, బంగారు నగలు తీసుకుని తాకట్టు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడింది. ఆ నగల విలువ రూ.10.5 లక్షలు. ఈసారి కూడా భవాని ఆన్ లైన్ రమ్మీలో నష్టపోయింది.  
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments