Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:16 IST)
విద్యార్థినిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్‌కు తీసుకెళ్లిమరీ పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తన  తల్లిదండ్రులకు చెప్పడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్యూటర్ ఉపాధ్యాయుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాడు. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన ముడిచ్చూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తాంబరం సమీపంలోని సోమంగళం ప్రాంతానికి చెందిన ఓ బాలిక ముడిచ్చూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
 
అయితే, ఈ విద్యార్థినికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు వెళ్లలేదు. పైగా, ఆమె తీవ్ర అనారోగ్యంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఏం జరిగిందంటూ నిలదీసింది. దీంతో పాఠశాలలో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని తల్లి తాంబరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ (30) విద్యార్థినిని కంప్యూటర్‌ ల్యాబ్‌కు తీసుకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments