Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు అడ్డుగా వుందని ఎంత పనిచేశాడు.. చెన్నైలో దారుణం

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:11 IST)
ప్రేమకు అడ్డు చెప్పిందని.. ప్రేమించిన ప్రియురాలితో వివాహం జరపలేదన్న కోపంతో మె తల్లిని సజీవ దహనం చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుడి ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట, అనంతనాయగినగర్‌లో నివసించే వెంకటమ్మ (50), వెంకటేశన్‌ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. వెంకటేశన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల క్రితం మరణించాడు, దీంతో కారుణ్య నియామకాల కోటాలో రజితకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. 
 
అదే ప్రాంతానికి చెందిన భూపాలన్‌ కుమారుడు సతీష్‌ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్దతిన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రజితకు ఉద్యోగం రాక ముందు నుంచే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. రజితకు కూడా చెన్నై కార్పోరేషన్‌లో ఉద్యోగం రావటంతో వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మరింత బలపడింది. ఈ క్రమంలో రజితను ఇచ్చి పెళ్లి చేయమని సతీష్ వెంకటమ్మను అడిగాడు. వెంకటమ్మ అందుకు అంగీకరించకపోగా…అదే ప్రాంతానికి చెందిన వేరోక యువకుడితో రజితకు పెళ్లి చేసేందుకు గతవారం నిశ్చితార్ధం జరిపించింది.
 
దీంతో సతీష్ గురువారం రాత్రి వెంకటమ్మ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనతోపాటు తీసుకెళ్లిన పెట్రోల్ న వెంకటమ్మ, రజితలపైన పోసి నిప్పింటించాడు. తాను వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురూ సజీవ దహనమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments