Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైదాపిండిని వాడుతున్నారా? పేగులకు అవి అతుక్కుపోతాయట!

మైదాపిండిని వాడుతున్నారా? పేగులకు అవి అతుక్కుపోతాయట!
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:18 IST)
Maida
మైదాపిండితో ఆరోగ్యానికి కీడు తప్పదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వ‌ర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ది. అవి ముదిరితే క్యాన్స‌ర్ లాంటి తీవ్రమైన ప్రాణాంత వ్యాధుల‌కు దారితీస్తాయి. 
 
మైదా పిండిని గోడ‌ల‌కు పోస్ట‌ర్ల‌ను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే  మైదాపిండిలోని జిగురు పోస్ట‌ర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్న‌ప్పుడే అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్ప‌త్తై ఇన్ఫెక్ష‌న్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి. మైదా పిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.
 
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టం వ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు నామమాత్రంగా ఉంటాయి. అదేవిధంగా మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువును తగ్గించే సులభమైన చిట్కా.. జీలకర్రను పెరుగుతో కలిపి..?