వ్యభిచార డబ్బు పంపిణీలో ఘర్షణ ... యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (08:56 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. వ్యభిచార డబ్బు పంపిణీలో వివాదం చెలరేగింది. దీంతో ఓ యువకుడి శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన చెన్నై అశోక్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థాని అశోక్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు కాలిన గాయాలతో పడివున్నాడని చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని చేపట్టిన విచారణలో, అతను ఢిల్లీ పూర్వికంగా ఉన్న దీపక్‌ అని, టి.నగర్‌లోని రెడీమేడ్‌ దుస్తుల విక్రయాలు చేస్తుంటాడని తెలిసింది. 
 
అదేసమయంలో వంట చేస్తుండగా ప్రమాదం సంభవించినట్టు దీపక్‌ పోలీసులకు తెలిపాడు. అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అతని శరీరంలో గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో అనుమానించిన పోలీసులు, అతని గదిని తనిఖీ చేయగా, రక్తపు మరకలతో ఉన్న కత్తి, కిరోసిన్‌ క్యాన్‌ను గుర్తించారు. అనంతరం దీపక్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను పరిశీలించగా, ఘటన జరగడానికి ముందు అతను రెండు నెంబర్లతో మాట్లాడినట్టు తెలిసింది. 
 
అలాగే, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, ఓ యువతి, యువకుడు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ రెండు నెంబర్లను ట్రేస్‌ చేయగా, చెన్నై విమానాశ్రయం వద్ద సిగ్నల్స్‌ లభించాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. 
 
వారు ఢిల్లీకి చెందిన హేమంత్‌, నీలలుగా గుర్తించారు. వీరిద్దరూ దీపక్‌తో కలసి వ్యాపారం చేస్తూ వచ్చారు. అయితే, అందులో లాభాలు లేకపోగా నష్టాలే వస్తుండటంతో హేమంత్‌ సలహా మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార వృత్తి నడపసాహారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే అమ్మాయలను ఓ వారం రోజుల పాటు ఉంచుకుని ఆ తర్వాత వారిని విమానాల ద్వారా స్వరాష్ట్రాలకు పంపిస్తున్నట్టు విచారణలో తేలింది. 
 
ఇలా వచ్చిన నీల అనే యువతి వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బును ఈ ముగ్గురు వాటాలు వేసుకోవడంలో ఘర్షణ తలెత్తింది. దీంతో హేమంత్‌, నీలలు కలిసి దీపక్‌ను కత్తితో పొడిచి, కిరోసిన్‌ పోసి తగులబెట్టి, ఇద్దరూ ముంబైకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లారని తేలింది. దీంతో, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments