Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ధరించలేదని.. వెంటబడిన పోలీసులు.. యువతి కిందపడి?

హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పో

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (12:43 IST)
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చి, తిరువెంబూరు చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రాజా అనే యువకుడు.. బైక్‌ను ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. 
 
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్ వారి వెంటపడ్డాడు. ఈ క్రమంలో రాజా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజా సతీమణి దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజా బైకును ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఢీకొనడంతోనే ఆతని భార్య కిందపడి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments