Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడిపంతులు బదిలీపై వెళుతుంటే కన్నీరుమున్నీరైన విద్యార్థులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (17:42 IST)
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే. అలాంటి గురువులు తమ పాఠశాలను వీడి మరో స్కూలుకు వెళుతుంటే విద్యార్థులు బోరున విలపిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ బడిపంతులు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెళ్లొద్దు సార్ అంటూ బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని చందౌలి జిల్లా రాయ్‌ఘడ్ అనే మారుమాల కొండ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు నాలుగేళ్ల క్రితం శివేంద్ర సింగ్ అనే ఉపాధ్యాయుడు విధుల్లో చేరాడు. చిన్నారులకు మంచి చెడులు చెపుతూ వారి మనస్సులను గెలుచుకున్నాడు. విద్యా బోధన కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేవాడు. దీంతో శివేంద్రను చిన్నారులు అమితంగా ప్రేమిస్తూ వచ్చారు. పైగా, గత నాలుగేళ్లలో చిన్నారుల హాజరుశాతం కూడా గణనీయంగా పెరిగింది. 
 
ఈ క్రమంలో శివేంద్ర సింగ్‌ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థులు బోరున విలపించారు. సరిగ్గా గురు పౌర్ణమి రోజున ఆయనకు వీడ్కోలు పలికారు. ఆ పార్టీలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ విద్యార్థులను సముదాయించి, వారి నుంచి సెలవు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments