Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి వ్యాపారులకు ఏం సంపాదన వస్తుందిలే అనుకునేరు.. వారంతా కోటీశ్వరులే!

Webdunia
గురువారం, 22 జులై 2021 (19:18 IST)
వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీధి వ్యాపారులకు ఐటీ వల్ల ఇబ్బందులుండవు. వీధి వ్యాపారులకు ఏం సంపాదన వుంటుందని అందరూ అనుకుంటారు. కానీ వీధి వ్యాపారులకు ఏం సంపాదన వుంటుందని నిర్లక్ష్యం చేసిన కొందరికి ఐటీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. 
 
యూపీలోని కొందరు వ్యాపారులపై దృష్టిపెట్టి కోట్లలో సంపాదించినట్లు గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. 256 మంది చిరు వ్యాపారులకు సంబందించిన డేటాను ఆదాయపన్ను అధికారులు సేకరించారు. ఈ డేటాలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా కోటీశ్వరులని తేలింది.
 
చిరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు కూడబెట్టి కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఖరీదైన ప్రాంతాల్లో వీరికి కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
 
ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్నుకూడా కట్టకుండా చిరు వ్యాపారం చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరిలో చాలామంది పెద్ద ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ తెలియజేసింది. ఇక వీరి నుంచి పన్ను వసూలు చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే 256 మందికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments