Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కొత్త ఐటీ మంత్రి... మావే అత్యుత్తమ చట్టాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (17:17 IST)
కేంద్ర ఐటీ శాఖామంత్రిగా అశ్వనీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పాత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను తొలగించి, ఆయన స్థానంలో అశ్వనీ వైష్ణవ్‌ను ఐటీ మంత్రిగా చేశారు. 
 
ఆయన అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవని, ఖచ్చితంగా కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనని ట్విట్టర్‌కు తేల్చి చెప్పారు. 
 
కొన్ని రోజుల నుంచి నిబంధనల విషయంలో ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని మొన్నటి వరకూ ఐటీ శాఖా బాధ్యతలు చూసుకున్న రవిశంకర్ ప్రసాద్ కూడా ట్విట్టర్‌ను మందలించిన విషయం విషయం తెలిసిందే. 
 
అయితే, రవిశంకర్ మందలింపులను ట్విట్టర్ ఇండియా యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా, కేంద్ర వైఖరిని ట్విట్టర్‌కు తేటతెల్లం చేయడంలో రవిశంకర్ ప్రసాద్ విఫలమయ్యారనే వాదనలు విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మంత్రిపదవిని కోల్పోవాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments