Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 5, 8 తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణత : కేంద్ర స్పష్టీకరణ

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (10:51 IST)
పాఠశాల విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా, 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అయితే, నో డిటెన్షన్ విధాన నిబంధనలను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయని వెల్లడించింది. 
 
ఇప్పటివరకు 5,8 తరగతుల విద్యార్థులకు ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్థులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకపోతే అదే తరగతుల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది.
 
ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు మూడు వేల పాఠశాలల్లో మాత్రమే వర్తించనుంది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. మరో కీలక విషయం ఏమిటంటే .. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం అని కేంద్రం పేర్కొనడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments