Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" : రాంనాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలో నిపుణుల కమిటీని శుక్రవారం ఏర్పాటుచేసింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుందని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌‍లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకేరోజున ఎన్నుకోవచ్చు. తద్వారా సమయంతో పాటు ఎన్నికల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments