కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా: ఇక మిగిలింది ఒక్కరే

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (22:30 IST)
పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ఎందుకు రాజీనామా చేసారన్నది తెలియాల్సి వుంది. కాగా ఈయన పదవీకాలం 2027 వరకూ వున్నది. ఐతే మూడేళ్లు ముందుగానే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
 
అరుణ్ గోయల్ 1985 పంజాబ్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2022లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులయ్యారు. ఇదిలావుండగా ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని అనుప్ పాండే గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసారు. తాజాగా అరుణ్ రాజీనామా చేసారు. ఇక మిగిలింది సీఈసిగా వున్న రాజీవ్ కుమార్ ఒక్కరే. ఈ నేపధ్యంలో ఖాళీగా వున్న రెండు పోస్టులను ఎపుడు భర్తీ చేస్తారన్నది చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments