Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (11:09 IST)
Cash for jobs scam
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌పై గోవా ముఖ్యమంత్రి భార్య సులక్షణ సావంత్ తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీచేసింది. పైగా, జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన కుంభకోణం వ్యవహారంపై ఇటీవల ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సీఎం భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఆమె నార్త్ గోవాలోని బిచోలిమ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అడ్ హక్ సివిల్ జడ్జి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు.
 
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని సీఎం ప్రమోద్ సావంత్ భార్య తన న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్ధించారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆమె కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments