Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (11:09 IST)
Cash for jobs scam
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌పై గోవా ముఖ్యమంత్రి భార్య సులక్షణ సావంత్ తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీచేసింది. పైగా, జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన కుంభకోణం వ్యవహారంపై ఇటీవల ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సీఎం భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఆమె నార్త్ గోవాలోని బిచోలిమ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అడ్ హక్ సివిల్ జడ్జి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు.
 
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని సీఎం ప్రమోద్ సావంత్ భార్య తన న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్ధించారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆమె కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments