Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలపై కేసు: స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
శనివారం, 15 మే 2021 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సంస్థలపై కేసు నమోదు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమాచారాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత నెరవేరుస్తున్న మీడియాపై కేసుల బనాయింపు సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న అంశాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దృష్టికి తీసుకు వెళ్తా.
 
దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియాపై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాదు. కేంద్ర ప్రభుత్వంపై అనేక మీడియా సంస్థలు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఏనాడు వారిపై ఆంక్షలు విధించలేదు.
 
ఇప్పటివరకూ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీడియా సంస్థపై నిషేధం విధించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టారన్న వార్తలపై సంబంధిత శాఖతో చర్చిస్తా అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments