Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి.. జగన్ పైన జవహర్ సెటైర్స్

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి.. జగన్ పైన జవహర్ సెటైర్స్
, గురువారం, 13 మే 2021 (22:43 IST)
ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు విసిరారు. ఆయన ఇలా పేర్కొన్నారు. మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లు వనుక్కొంటూ వెళ్లి అయిన కాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు.

మొండికేసిన సంగం డైరీ చైర్మన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినక పోతే జువారి సిమెంట్, అమర్ రాజా బాటరీస్ కు పొల్యూషన్ నోటీస్ ఇచ్చి మూసేయించాము. వ్యాక్సిన్ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏందీ?

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి పట్టుకొద్దాం. అంత వద్దని అనుకొంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ కంపెనీ వాడి సర్వర్లు పట్టుకొచ్చి మన సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇద్దాం.

వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని గుద్ది మనకు ఇచ్చేస్తారు. వాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును రామోజీ రావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్ మనకు ఉందిగా!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా నుంచి ఇండియాకు ఈజీగా డబ్బు పంపొచ్చు.. జీ-పే వుంటే చాలు