Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:48 IST)
Car
కేరళలోని త్రిస్సూర్‌లో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. సినీఫిక్కీలో పీచీ సమీపంలోని జాతీయ రహదారి వద్ద 12 మందితో కూడిన ముఠా మూడు కార్లలో దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో 2.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ రాబరీ కోసం త్రిశూర్‌ హైవేపై భారీ ఛేజింగ్‌ డ్రామా నడిచింది. 
 
త్రిశూర్‌ హైవేపై గోల్డ్‌ వ్యాపారి కారును మూడు కార్లతో వెంబడించి.. భారీ మొత్తంలో బంగారాన్ని కొట్టేసింది. క్షణాల్లో కారులో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత గోల్డ్ వ్యాపారిని కూడా కారులో ఎక్కించుకుని.. నాలుగు కార్లలో పరారయ్యారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ అయ్యింది. అందులో మూడు కార్లు జాతీయ రహదారి మధ్యలో మరో కారును అడ్డుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments