Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల కౌంటింగ్‌కు వెళ్లాలంటే కోవిడ్ నెగెటివ్ రిపోర్టు మస్ట్ : ఈసీ

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:42 IST)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే నెల రెండో తేదీన జరుగనుంది. వెస్ట్ బెంగాల్‌తో పాటు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల శాసనసభలకు ఈ ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌లో మాత్రం చివరి దశ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం (మే 2) కౌంటింగ్ జరగనుంది. ఇదేసమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు ఆంక్షలను విధించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్లోకి అడుగుపెట్టాలంటే... వారితో పాటు కరోనా నెగెటివ్ రిపోర్టును ఖచ్చితంగా తీసుకురావాలని తెలిపింది. 
 
లేదా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న పత్రాలను తీసుకురావాలని చెప్పింది. ఈమేరకు ఈసీ కొత్త ఉత్వర్వులను జారీ చేసింది. కౌంటింగ్ సెంటర్ల వెలుపల జనాలు గుమికూడరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
కాగా, అభ్యర్థులు, వారి ఏజెంట్లు 48 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టులను తీసుకురావాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే వీటిని సమర్పించాలని తెలిపింది.
 
మరోవైపు, కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎన్నికల ర్యాలీలకు ఈసీ అనుమతించడం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments