Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి ప్రేమ దక్కలేదు... కిరాతకుడిగా మారి 33 మందిని చంపేశా...

తనకు తండ్రి ప్రేమ దక్కలేదనీ, అందుకే అత్యంత కిరాతకంగా మారి 33 మందిని చంపేసినట్టు ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సీరియల్ కిల్లర్‌ను ఆ రాష్ట్ర పోలీస

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:04 IST)
తనకు తండ్రి ప్రేమ దక్కలేదనీ, అందుకే అత్యంత కిరాతకంగా మారి 33 మందిని చంపేసినట్టు ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సీరియల్ కిల్లర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సీరియల్ కిల్లర్ పేరు ఆదేశ్ ఖమ్రా.
 
ఈయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో... 'నాకు తండ్రి ప్రేమ దక్కలేదు... అందుకే నేను కిరాతకుడిగా మారి 33 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లను హత్య చేశాను' అని చెప్పాడు. 'నాకు బాల్యంలో తండ్రి ప్రేమ లభించక పోగా, నన్నెవరూ పట్టించుకోలేదు. దీంతో పెరిగేకొద్దీ నాలో హింసాత్మక ప్రవృత్తి పెరిగింది' అని తెలిపాడు. 
 
కాగా, ఖమ్రా తండ్రి గులాబ్ ఖమ్రా భారతీయ సైన్యంలో ఓ సుబేదారుగా పని చేశారు. దీంతో ఆదేశ్‌ ఆలనాపాలనా అంతా ఆమె తల్లే చూసుకునేది. పైగా, ఎపుడో ఒకసారి ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఆదేశ్‌ను గులాబ్ పెద్దగా దగ్గరకు చేరదీసేవాడు కాదు. చిన్నచిన్న విషయాలకే కొట్టి ఇంట్లో నుంచి బయటకు విసిరి వేసేవాడు. ఇవన్నీ మనసులో నాటుకుని పోవడంతో ఆదేశ్ కిరాతకుడిగా మారిపోయాడు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments