హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు బుర్హాన్ ముజఫర్ వనీ చివరగా ఎలాంటి ట్వీట్ చేశాడో తెలుసా.? ఆ ట్వీట్ కూడా వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్కు చేశాడు. ఇందులో జకీర్ను ఆకాశానికెత్తేశాడు.
హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు బుర్హాన్ ముజఫర్ వనీ చివరగా ఎలాంటి ట్వీట్ చేశాడో తెలుసా.? ఆ ట్వీట్ కూడా వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్కు చేశాడు. ఇందులో జకీర్ను ఆకాశానికెత్తేశాడు.
గత శుక్రవారం కాశ్మీర్ లోయలో జరిగిన ఎన్కౌంటర్లో బుర్వాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెల్సిందే. ఈ ఎన్కౌంటర్కు ముందు.. ఈనెల 8వ తేదీన చివరిసారిగా బుర్వాన్ వనీ చివరి ట్వీట్ చేశాడు. ఇందులో జకీర్ నాయక్ను ఆకాశానికి ఎత్తేశాడు.
'జకీర్ నాయక్కు సపోర్ట్ చేయండి. లేదంటే ఏదో ఒకరోజు ఖురానా పఠానంపై కూడా నిషేధం విధిస్తారు' అని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. జకీర్ నాయక్ స్ఫూర్తితోనే ఢాకా కేఫ్లో దాడులకు తెగబడినట్టు బంగ్లా ఉగ్రవాదులు ఇటీవల వెల్లడించడంతో జకీర్ చుట్టూ వివాదాలు ముసిరాయి.
ఈ ఉదంతం తర్వాత జకీర్ నాయక్కు సంబంధించిన పబ్లిక్ డాక్యుమెంట్లు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్లు వంటి సమాచారం సేకరించాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే మోస్ట్వాంటెడ్ బుర్హాన్ వనీ సైతం తన చివరి ట్వీట్లో జకీర్కు మద్దతివ్వండంటూ ట్వీట్ చేయడం మరింత సంచలనమవుతోంది.