Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాలను మింగేసిన ఎద్దు... పేడలోనైనా వస్తాయనీ...

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:51 IST)
హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బంగారు ఆభరణాలను మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న గృహిణి ఆ ఎద్దు వేసే పేడలోనైనా బంగారు ఆభరణాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిర్సాలోని కలనవాలి ఏరియాలో ఓ మహిళ తన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ గిన్నెలో వేసింది. అయితే కూరగాయలు కత్తిరించగా వచ్చిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో పొరపాటున వేసింది. 
 
ఆ గిన్నెలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయన్న విషయం మరిచిన మహిళ... తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీ వద్ద పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 
 
ఆ తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం కనిపించకపోవడంతో ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో తేలింది. దీంతో బాధితురాలు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించి.. ఆ ఎద్దును పట్టుకున్నారు. 
 
ఇప్పుడు తన ఇంటి వద్దే ఎద్దును కట్టేసి దాన పెడుతున్నారు. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఆమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ పేడలో కూడా బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని బాధితురాలు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments