Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాలను మింగేసిన ఎద్దు... పేడలోనైనా వస్తాయనీ...

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:51 IST)
హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బంగారు ఆభరణాలను మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న గృహిణి ఆ ఎద్దు వేసే పేడలోనైనా బంగారు ఆభరణాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిర్సాలోని కలనవాలి ఏరియాలో ఓ మహిళ తన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ గిన్నెలో వేసింది. అయితే కూరగాయలు కత్తిరించగా వచ్చిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో పొరపాటున వేసింది. 
 
ఆ గిన్నెలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయన్న విషయం మరిచిన మహిళ... తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీ వద్ద పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 
 
ఆ తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం కనిపించకపోవడంతో ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో తేలింది. దీంతో బాధితురాలు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించి.. ఆ ఎద్దును పట్టుకున్నారు. 
 
ఇప్పుడు తన ఇంటి వద్దే ఎద్దును కట్టేసి దాన పెడుతున్నారు. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఆమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ పేడలో కూడా బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని బాధితురాలు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments