Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాలను మింగేసిన ఎద్దు... పేడలోనైనా వస్తాయనీ...

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:51 IST)
హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బంగారు ఆభరణాలను మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న గృహిణి ఆ ఎద్దు వేసే పేడలోనైనా బంగారు ఆభరణాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిర్సాలోని కలనవాలి ఏరియాలో ఓ మహిళ తన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ గిన్నెలో వేసింది. అయితే కూరగాయలు కత్తిరించగా వచ్చిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో పొరపాటున వేసింది. 
 
ఆ గిన్నెలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయన్న విషయం మరిచిన మహిళ... తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీ వద్ద పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 
 
ఆ తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం కనిపించకపోవడంతో ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో తేలింది. దీంతో బాధితురాలు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించి.. ఆ ఎద్దును పట్టుకున్నారు. 
 
ఇప్పుడు తన ఇంటి వద్దే ఎద్దును కట్టేసి దాన పెడుతున్నారు. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఆమె ఆశలు పెట్టుకుంది. ఒక వేళ పేడలో కూడా బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని బాధితురాలు చెప్పింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments