Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో హై డ్రామాకు తెరపడింది.. మ్యాజిక్ చేసిన యడ్డ్యూరప్ప..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (13:00 IST)
కర్ణాటకలో హై డ్రామాకు తెరపడింది. కర్ణాటక విధాన సౌధలో ముఖ్యమంత్రి యడియూరప్ప 'మ్యాజిక్‌' చేశారు. విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలుపొందారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 104 దాటి రెండు ఓట్లను అధికంగా దక్కించుకుంది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా మొత్తం 106 మంది సభ్యుల ఓటేశారు.


మూజువాణి ఓటు ద్వారా యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో.. కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి సోమవారంతో తెరపడినట్టయింది.
 
అంతకముందు ఇవాళ విధానసౌధలో యడియూరప్ప మాట్లాడుతూ  'జరిగిందంతా మరచిపోతా. అందరినీ క్షమిస్తా. నన్ను వ్యతిరేకించిన వారిని కూడా ప్రేమిస్తా' అని చెప్పారు. కరువుతో అల్లాడుతున్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. 
 
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ సభ ప్రారంభమవగానే నిర్వహించిన విశ్వాస పరీక్షలో బీజేపీ విజయం సాధించింది. ఆ వెంటనే రమేష్‌కుమార్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని కొంత మంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతో ఆ పదవికి రమేష్‌కుమార్ రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments