Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య అత్యాచారం చేశాడా? గమ్మునుండు... పరువుపోద్ది...

అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంల

Webdunia
బుధవారం, 25 జులై 2018 (16:30 IST)
అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా చండీఘర్‌లో చోటుచేసుకున్న దారుణం ఇలా వుంది. 
 
11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల సోదరుడు గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పింది. ఐతే విషయాన్ని విన్న తల్లి కుమారుడిపై చర్య తీసుకోవాల్సింది పోయి... గమ్మునుండు... పరువు పోతుంది. చేస్తే చేశాడులే అంటూ ఆమెకు సర్దిచెప్పింది. అంతటితో ఊరుకోకుండా ఆమె మతిభ్రమించి మాట్లాడుతుందంటూ తాంత్రికవేత్తల వద్దకు తీసుకెళ్లింది. 
 
కానీ ఆ బాలికపైన సోదరుడు మాత్రం ప్రతిరోజూ అత్యాచారానికి పాల్పడుతూనే వున్నాడు. చివరికి బాధిత బాలిక విషయాన్ని తను చదువుకుంటున్న పాఠశాలలో చెప్పేసరికి వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments