Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం - కవితకు ఈడీ నోటీసులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (19:45 IST)
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం హాజరుకావలంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఈ కేసులో గత యేడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు వించారించారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‍కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు జారీచేసింది. 
 
కానీ, ఆయన మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ మరోమారు అంటే నాలుగోసారి నోటీసులు జారీచేసింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోమారు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇదిలావుంటే ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments